ఉస్మానియా యూనివర్సిటీలో పెండింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి : జేఏసీల లీడర్లు జార్జిరెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీలో పెండింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి : జేఏసీల లీడర్లు జార్జిరెడ్డి

ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌లో ఉన్న 2 లక్షల పోస్టులతో నోటిఫికేషన్​రిలీజ్​చేయాలని ఓయూ, నిరుద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీల లీడర్లు జార్జిరెడ్డి, డాక్టర్​ ఎస్.నాగేశ్వర రావు, ఎన్. సుమంత్, కె.స్వాతి మాట్లాడుతూ కాంగ్రెస్​ ఎన్నికల హామీ ప్రకారం ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్​ జూనియర్​ లెక్చరర్లు, డిగ్రీ, పాలిటెక్నిక్​ లెక్చరర్ల రెగ్యులరైజేషన్​ ప్రక్రియను రద్దు చేసి పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి, నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

సుప్రీంకోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల్లో ఫైనల్​ జడ్జిమెంట్​ వచ్చే దాకా కాంట్రాక్ట్​ లెక్చరర్లకు ఎటువంటి ఇంక్రిమెంట్లు ఇవ్వొద్దని కోరారు. కాంగ్రెస్​ సర్కారులోనైనా ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇప్పటికీ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోందని విమర్శించారు. సీఎం రేవంత్​ రెడ్డి జోక్యం చేసుకుని 2 లక్షల ఉద్యోగాలతో పాటు డీఎస్సీ, 20 వేల పోలీస్‌‌‌‌ కొలువులను వెంటనే భర్తీ చేయాలన్నారు.