పోలీస్ పోస్టులు 20 వేలకు పెంచాలి..ఓయూలో నిరుద్యోగుల ర్యాలీ

పోలీస్ పోస్టులు 20 వేలకు పెంచాలి..ఓయూలో నిరుద్యోగుల ర్యాలీ

ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో పోలీస్​పోస్టులను 20 వేలకు పెంచి, నోటిఫికేషన్​రిలీజ్ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. కమిటీ చైర్మన్​మోతిలాల్​నాయక్​ఆధ్వర్యంలో మంగళవారం ఓయూలో నిరుద్యోగులు ర్యాలీ తీశారు. కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్​ఇస్తే ఊరుకునేది లేదన్నారు. ఉద్యోగాలకు ఉన్న కండీషన్స్ సవరించాలని, ఎస్సై పోస్టుకు వయోపరిమితిని 38 ఏండ్లకు పెంచాలని, జీవో 46ను రద్దు చేసి, అప్లికేషన్​ ఫీజు రూ.100కు తగ్గించాలని కోరారు.