స్టూడెంట్లు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి : ఓయూ వైస్​ చాన్స్​లర్ రవీందర్ యాదవ్

స్టూడెంట్లు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి : ఓయూ వైస్​ చాన్స్​లర్ రవీందర్ యాదవ్

స్టూడెంట్లు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
ఓయూ వైస్​ చాన్స్​లర్ రవీందర్ యాదవ్

ఓయూ, వెలుగు : స్టూడెంట్లలో స్కిల్స్ కొరత తీవ్రంగా ఉందని, కేవలం 2శాతం మందిలో మాత్రమే  జాబ్​కు కావాల్సిన స్కిల్స్ ఉంటున్నాయని ఓయూ వైస్ ​చాన్స్​లర్​ ప్రొఫెసర్  రవీందర్ ​యాదవ్ ​అన్నారు. స్కిల్ డెవలప్​మెంట్   దిశగా స్టూడెంట్లు కష్టపడాలన్నారు.  ఓయూ టెక్నాలజీ కాలేజీలో ‘లీన్ మానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఫర్ టెక్స్​టైల్ అండ్ అప్పారెల్ ఇండస్ట్రీస్’  ట్రైనింగ్​ప్రోగ్రామ్​ను ​సోమవారం ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. జాబ్ కోసం వేచి చూసే స్థాయి నుంచి జాబ్ ఇచ్చే స్థాయికి స్టూడెంట్లు ఎదగాలన్నారు. ఈ ట్రైనింగ్​ ప్రోగ్రామ్ ​ఈ నెల 25 వరకు కొనసాగుతుందని కాలేజ్​ ప్రిన్సిపల్ ​ప్రొఫెసర్ ​చింతా సాయిలు తెలిపారు.  కార్యక్రమంలో ఫ్యాకల్టీ జె.హయవదన, రమేశ్​కుమార్, ప్రభాకరెడ్డి, ఎంఎస్ఎం డైరెక్టర్​డాక్టర్ ​గ్లోరీ స్వరూప తదితరులు పాల్గొన్నారు.