కేసీఆర్ అవినీతి పాలనపైనే మా పోరాటం

కేసీఆర్ అవినీతి పాలనపైనే మా పోరాటం

బాన్స్వాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనపై నిరంతరం పోరాటం చేస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ధాన్యం కొనకుండా కేసీఆర్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయపెట్టారని దుయ్యపట్టారు. రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రే ఇలా బాధ్యత రహితంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన పదవికి మచ్చతెచ్చే విధంగా ప్రవరిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో మెలుగుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. బాన్స్వాడలో పోచారం కుటుంబ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. ఈ నెల 20న ఎల్లారెడ్డిలో ‘మన ఊరు మన పోరు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారన్నారు. పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షబ్బీర్ అలీ కార్యకర్తలను  కోరారు. 

మరిన్ని వార్తల కోసం...

నెట్ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనఫు ఛార్జీలు!

పీకే ఇక్కడ పనికిరాడు.. గెలిచేది బీజేపీనే