రైలుకిందపడి ప్రేమజంట సూసైడ్

రైలుకిందపడి ప్రేమజంట సూసైడ్

తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమజంట సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన ఈ ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ సమీపంలో జరిగింది. ఉదయం 3 గంటలకు ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు పోలీసులు. నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్ డిగ్రీ చదువుతున్నాడు. మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో సూసైడ్ కు పాల్పడ్డారు. సమీపంలోని రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోస్ట్ మార్టమ్ కోసం డెడ్ బాడీలను హస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.