ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న రెండు లక్షల మంది భక్తులు

ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న  రెండు లక్షల మంది భక్తులు

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు గురువారం భారీగా తరలి వచ్చారు. 63 అడుగుల గణేషుని భారీ విగ్రహాన్ని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షల మంది భక్తులు గణేషుని దర్శించుకున్నారని ఉత్సవ కమిటి తెలిపింది. దీంతో ఖైరతాబాద్ మార్కెట్ రోడ్డు భక్తులతో నిండిపోయింది. ఎక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు. సెల్ఫీలతో సందడి చేశారు. భక్తులు భారీగా తరలి రావడంతో భారీ ఎత్తున పోలీసులు  భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు.