న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్ 3,06,635 యూనిట్ల రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లను రీకాల్ చేస్తోంది. 2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన మోడళ్లలో ఫ్రంట్ బ్రేక్లో లోపం ఉందని కంపెనీ గుర్తించింది. స్వచ్ఛంద రీకాల్ క్యాంపెయిన్ ప్రారంభించి, సంబంధిత భాగాన్ని ఉచితంగా మార్చి ఇస్తుంది.
