పెరుగుతున్న వెన్ను నొప్పి కేసులు.. 2050 నాటికి 800మిలియన్ల మందికి ముప్పు

పెరుగుతున్న వెన్ను నొప్పి కేసులు.. 2050 నాటికి 800మిలియన్ల మందికి ముప్పు

2050 నాటికి 800 మిలియన్లకు పైగా ప్రజలు నడుము నొప్పితో బాధపడుతారని లాన్సెట్ రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించింది. 2020తో పోలిస్తే 36 శాతం అధిక కేసులు నమోదవుతాయని వివరించింది. 2017 నుంచి వెన్నునొప్పి కేసుల సంఖ్య చాలా తక్కువ ఉండేదని, ఇప్పుడు దాని కంటే అర బిలియన్ కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 2020లో సుమారు 619 మిలియన్ల వెన్నునొప్పి కేసులు నమోదైనట్టు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2021 ఓ అధ్యయనంలో పేర్కొంది.

వెన్నునొప్పి కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. వెన్నునొప్పి కేసులలో ఆసియా, ఆఫ్రికా ముందంజలో ఉన్నాయని  సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. 1990 నుంచి 2020 వరకు 204 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా, వెన్నునొప్పి కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది, 2050 నాటికి 843 మిలియన్ల మంది జనాభా వృద్ధాప్యం, వెన్ను నొప్పి కారణంగా ఈ పరిస్థితికి గురవుతారని సమాచారం.

ప్రపంచంలో వైకల్యానికి ప్రధాన కారణం నడుము నొప్పి. సరైన చర్య తీసుకోకపోతే, నడుము నొప్పి మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక అనారోగ్య పరిస్థితులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు కూడా పూర్వగామిగా మారుతుందని పరిశోధకులు తెలిపారు. వెన్నునొప్పితో బాధపడేవారిలో కనీసం మూడింట ఒక వంతు వృత్తిపరమైన కారకాలు, ధూమపానం, అధిక బరువుకు కారణమని అధ్యయనం తెలిపింది.

సాధారణంగా ఈ వెన్నునొప్పి ఎక్కువగా పని చేసే వయస్సులో ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. కానీ వృద్ధులలో నడుము నొప్పి ఎక్కువగా వస్తుందని అధ్యయనం నిర్ధారించింది. మగవారితో పోలిస్తే ఆడవారిలో నడుము నొప్పి కేసులు కూడా ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.