సింగరేణిలో ఆగిన ‘కన్వేయన్స్’ వెహికల్స్​ ఓనర్ల

సింగరేణిలో ఆగిన ‘కన్వేయన్స్’ వెహికల్స్​ ఓనర్ల
  • నిరవధిక సమ్మె షురూ ​

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ప్రభావిత గ్రామాల యువతను సింగరేణి యాజమాన్యం ఉపాధి పేరుతో ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ సింగరేణి వ్యాప్తంగా కన్వేయన్స్​వెహికల్స్ ఓనర్లు సమ్మెకు దిగారు. గురువారం బెల్లంపల్లి రీజియన్​పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో, జైపూర్​ సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​లో కన్వేయన్స్​వెహికల్స్​ఓనర్లు తమ వాహనాలను ఆయా జీఎం ఆఫీస్​ల ముందు నిలిపి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఓనర్లు మాట్లాడుతూ.. భూ నిర్వాసితులు, సమీప గ్రామాల ప్రజలు, మాజీ ఉద్యోగులు, కార్మికుల పిల్లలు అద్దె వెహికల్స్ పెట్టుకునేందుకు ఛాన్స్​ఇచ్చిన సింగరేణి యాజమాన్యం వారికి అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 

సంస్థలో వెహికల్స్ పెట్టి అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందారు. తమకు సీఎంపీఎఫ్ లో​ కోత లేకుండా చూడాలని, 2017 నుంచి యూనిట్​రేట్​పెంచాలని ఉద్యమిస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. టెండర్​ కాలపరిమతి ఆరేళ్లకు పొడిగించాలని, అదనంగా కిలోమీటర్​కు రూ.20 పెంచాలని డిమాండ్​చేశారు. ఈ సమ్మెతో సింగరేణి వ్యాప్తంగా 4వేల వెహికల్స్​నడవలేదు. దీంతో జీఎం ఆఫీస్, బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లలో డ్యూటీలకు వెళ్లే జీఎం నుంచి కింది స్థాయి ఆఫీసర్లు ఇబ్బందులు పడ్డారు. సొంత, ప్రైవేటు వెహికల్స్​లో డ్యూటీలకు వచ్చారు.