అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎస్ ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అద్యయన కమిటీ వేయాలని బుధవారం కేబినెట్ నిర్ణయం తీసుకోగా..జిల్లాల ఏర్పాటులో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అధికారులకే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించగా..పార్లమెంట్ నియోజకవర్గాలు సరిహద్దులుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.