కల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం : సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్

 కల్దుర్కిలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం : సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్

 బోధన్​,వెలుగు: మండలంలోని కల్దుర్కిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్​ గింజుపల్లి శరత్​ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి తక్కువ ధరకు వడ్లు విక్రయించి మోసపోవద్దన్నారు. తడి వడ్లు తీసుకురాకుండా ఎండబెట్టి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నా రు. ‘ఏ’ గ్రేడ్​ ధాన్యం క్వింటాల్​రూ.2389, ‘బీ’ గ్రేడ్​ధాన్యం క్వింటాల్​ రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. కొనుగోలు సెంటర్​లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. టార్ఫాలిన్లతోపాటు రైతుల కోసం టెంట్లు, తాగునీటి వసతి కల్పించామన్నారు.  కార్యక్రమంలో అగ్రికల్చర్​ ఏడీఏ ఎండీ అలీం, సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్ చారి, కల్దుర్కి ఏఈవో అనుజసాయిచరణ్, సిద్దాపూర్​ ఏఈవో మహమ్మద్​ ముజమ్మాయిల్, రైతులు ప్రకాశ్​పటేల్, మాధవ్ రావు, గణపతిరెడ్డి, నరేందర్​ రెడ్డి, మారుతిరావు, మారయ్య పాల్గొన్నారు.