ఎక్కడలేని పథకాలు తెలంగాణలో ఉన్నయ్ : పద్మా దేవేందర్ రెడ్డి

ఎక్కడలేని పథకాలు తెలంగాణలో ఉన్నయ్ : పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు :  ప్రజా సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హవేలీ ఘనపూర్​కు చెందిన  కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేసి చూపించామన్నారు. మెదక్​ లో తనను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్​చైర్​పర్సన్​ లావణ్య, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి,  బీఆర్ఎస్​ నాయకులు ఆంజనేయులు, హవేళీ ఘనపూర్​ మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.