వేలంలో మోడీ ఫొటో పెయింటింగ్స్ ధర రూ.25 లక్షలు

వేలంలో మోడీ ఫొటో పెయింటింగ్స్ ధర రూ.25 లక్షలు

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జ్ఞాపికల ప్రదర్శన నిర్వహించి..ఈ-వేలం వేశారు. ఈ-వేలంలో ఓ అక్రిలిక్‌ పెయింటింగ్‌ అత్యధికంగా రూ.25 లక్షలకు అమ్ముడుపోయింది. దేశ ప్రధాని మోడీ దేశ, విదేశీ పర్యటనల సందర్భంగా వివిధ దేశాల అధిపతులు, అభిమానులు, దేశంలోని పలు సంస్థలు, రాజకీయ నాయకులు ఇచ్చిన 2,772 జ్ఞాపికలను ఈ వేలంలో ఉంచారు. వేలం ద్వారా వచ్చే డబ్బును ‘నమామి గంగే మిషన్‌’కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు.

ఈ- వేలంలో జాతిపిత మహాత్మాగాంధీ నిల్చున్న ఫొటోతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా రంగుల్లో చిత్రించిన మోడీ చిత్రం ఉన్న అక్రిలిక్ పెయిటింగ్‌ను ఓ కళాకారుడు 25 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు.

మోడీ తన తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను రూ.20 లక్షలకు మరో అభిమాని కొనుగోలు చేశాడు.