పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలను వెనక్కి పంపించాలి

పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలను వెనక్కి పంపించాలి

పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి వచ్చిన ముస్లింలను వెనక్కి పంపించాలని శివసేన తన అధికారిక న్యూస్ పేపర్ సామ్నాలో తెలిపింది. దీంతో పాటు.. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వచట్టంలో లోపాలున్నాయని పేర్కొంది. శివసేన ఎల్లప్పుడూ హిందుత్వ గురించి పోరాడిందని.. తాము తమ స్టాండ్ ను ఎప్పుడూ మార్చుకోమని తెలిపింది. ఈ మద్య.. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) తన జెండా రంగును మార్చుకుంది. ఇందుకు గాను శివసేన MNS పై పరోక్షంగా  స్పందిస్తూ… తమ పార్టీ జెండాను ఎప్పుడూ మార్చుకోలేదని తమది ఎల్లప్పుడూ మరాఠాతో కూడిన హిందుత్వ ఎంజెండానేనని చెప్పింది.