ఉగ్రవాదులను పంపడంలో పాకిస్తాన్ బిజీ..!

ఉగ్రవాదులను పంపడంలో పాకిస్తాన్ బిజీ..!

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పాకిస్తాన్ మాత్రం భారత బార్డర్‌లో (LoC) కాల్పులు జరుపుతుందని అన్నారు  ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవనే. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… కాల్పుల విరమణను పాకిస్తాన్ తరచూ ఉల్లంఘిస్తుందని తెలిపారు. భారత్ ‌తో సహా… ప్రపంచదేశాలు కరోనాను ఎదుర్కొంటుంటే పాకిస్తాన్ మాత్రం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో బిజీగా ఉందని అన్నారు. బార్డర్ వద్ద పరిస్థితులను పర్యవేక్షించడానికి నరవనే ప్రస్తుతం కశ్మీర్ లో పర్యటిస్తున్నారు.

దేశంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను భద్రతాదళాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని చెప్పారు జనరల్ ఎమ్ఎమ్ నరవనే. భారత్ సమర్థమంతమైన దేశమని… ఒకవైపు ప్రపంచదేశాలకు కరోనాను ఎదుర్కోవడానికి మందులు పంపిస్తూనే.. మరో వైపు దేశంలో కరోనా విజృంబించకుండా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భారత్ మందులను ఎగుమతి చేయడంలో బీజీగా ఉంటే… పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను ఎగుమతి చేయడంలో బిజీగా ఉందని ఆయన అన్నారు.

ఎప్రిల్ 5న కేరన్ సెక్టార్ నుంచి కాశ్మీర్ లోయకు ఉగ్రవాదులు చొరబడడానికి ప్రయత్నించారని భద్రతాదళాలు వారిని ఎదుర్కోగా… ఆ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులవగా, ఐదుగురు ఉగ్రవాదులు మృతిచెందారని తెలిపారు జనరల్. కాల్పుల విరమణను ఉల్లంగించినందుకు బార్డర్లోని పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ పోస్టులను, టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను  ద్వంసం చేసినట్లు తెలిపారు.