IND Vs PAK Match : గుజరాత్ వచ్చేసిన పాక్ టీం.. దద్దరిల్లేలా స్వాగత సత్కారాలు

IND Vs PAK Match : గుజరాత్ వచ్చేసిన పాక్ టీం.. దద్దరిల్లేలా స్వాగత సత్కారాలు

వరల్డ్ కప్ కోసం భారత్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకి హైదరాబాద్ లోనే కాదు అహ్మదాబాద్ లోనూ  అద్భుతమైన స్వాగతం లభిస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్ కోసంహైదరాబాద్ లో అడుగుపెట్టిన పాక్.. ఇక్కడ రెండు వారాలు తర్వాత తాజాగా అహ్మదాబాద్ చేరుకుంది. హోటల్‌లోకి ప్రవేశించిన ఆటగాళ్లపై పూలవర్షం కురిపించి, సంగీత్‌ వాయించారు. పాక్ ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు బాలికలు సంప్రదాయ గర్బా ప్రదర్శనలు చేశారు. 

హోటల్‌లో టీమ్‌కు ఘనస్వాగతం లభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాక్ కి ఎక్కడికి వెళ్లినా వారి ఆతిధ్యానికి ఎలాంటి లోటు జరగట్లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో చూపిన ప్రేమకు పాక్ ప్లేయర్లు ఫిదా కాగా.. తాజాగా అహ్మదాబాద్ లోను వీరికి అలాంటి ఘన స్వాగతం లభించడం విశేషం. ఇక నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ గెలిచిన  భారత్ నేడు హైదరాబాద్ కి పయనమవుతుంది. 

Also Read : Cricket World Cup 2023: అందుకే కోహ్లీని కింగ్ అన్నారు: విరాట్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా

కాగా..  వరల్డ్ కప్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. కోసం అభిమానులతో పాటు యావత్ భారత్ ఎంతగానో ఎదురు చూస్తుంది. అక్టోబర్ 14 న దాయాదుల మధ్య సమరం జరగనుంది. రెండు జట్లు కూడా వరల్డ్ కప్ లో తమ రెండు మ్యాచులు గెలిచి మంచి ఫామ్ లో ఉన్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.