రైలులో మంటలు.. 16 మంది సజీవ దహనం

రైలులో మంటలు.. 16 మంది సజీవ దహనం

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వస్తున్న తేజ్గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇవాళ(గురువారం) మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది సజీవ దహనం కాగా మరో  10 మందికి పైగా గాయాలయ్యాయి.  తల్వారీ స్టేషన్ దాటిన తర్వాత రహీమ్ యార్ ఖాన్ పట్టణానికి దగ్గరలోని లియాఖత్ పురలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సిలిండర్లు పేలడంతో మంటలు ఒక్కసారిగా మూడు బోగీలకు వ్యాపించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.