సెప్టెంబర్ 25 న ట్రంప్ ను కలవనున్న పాక్ ప్రధాని

సెప్టెంబర్ 25 న ట్రంప్ ను  కలవనున్న పాక్ ప్రధాని
  •     ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను కలవనున్నారు. ఇరు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించేందుకు కొత్త ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ట్రంప్​తో షెహబాజ్ భేటీ కానున్నారు. 

యునైటెడ్‌‌‌‌‌‌‌‌ నేషన్స్‌‌‌‌‌‌‌‌ జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఏ) సమావేశంలో పాల్గొనేందుకు షెహబాజ్ ప్రస్తుతం న్యూయార్క్​లో ఉన్నారు. అక్కడి నుంచి వాషింగ్టన్​కు ప్రయాణించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​తో భేటీ కానున్నారు. గురువారం న్యూయార్క్ కు తిరిగొచ్చి తన యూఎన్‌‌‌‌‌‌‌‌జీఏ కార్యక్రమాలను కొనసాగిస్తారు. దౌత్యవర్గాలను ఉటంకిస్తూ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్ పేపర్ బుధవారం ఈ విషయాలను వెల్లడించింది.