Cricket World Cup 2023: అంత మొనగాళ్లా వాళ్లు : ఇండియాను ఓడిస్తే డేటింగ్ కు వస్తా : బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ హీరోయిన్ ఆఫర్

Cricket World Cup 2023: అంత మొనగాళ్లా వాళ్లు : ఇండియాను ఓడిస్తే డేటింగ్ కు వస్తా : బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ హీరోయిన్ ఆఫర్

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు.. మన చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టును ఎటూ తిట్టలేక.. అలా అని ఇండియాను ఆడిపోసుకోలేక.. తన అక్కసు వెళ్లగక్కింది పాకిస్తాన్ స్టార్ హీరోయిన్. ఇండియాను ఎలాగైనా ఓడించాలి.. అది ముస్లిం దేశానికి చెందిన జట్టు అయ్యిండాలనే.. తన కోరికను మరోలా బయటపెట్టుకుంది ఈ బ్యూటీ.. మీరు అయినా ఇండియాను ఓడించండి.. అలా చేస్తే మీ జట్టుతో డేటింగ్ కు వస్తా అంటూ ఆఫర్ చేసింది ఈ పాకిస్తానీ నటి.. అమ్మడు ఆఫర్ పై ఇప్పుడు సోషల్ మీడియా దుమ్మురేగుతోంది..

వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో పాక్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సొంత అభిమానులే ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్ పై గెలిస్తే బంగ్లా క్రికెటర్ తో డేట్ కి వెళ్తానని పాకిస్థాన్ నటి  సెహెర్ షిన్వారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫిష్ డిన్నర్ చేస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ పై పాక్ ఎటు ప్రతీకారం తీర్చుకోలేకపోయింది. కనీసం బంగ్లాదేశ్ పై భారత్ ఓడిపోవాలని ఈ బ్యూటీ కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 

‘భారత్ తో ఆడే మ్యాచులో మా బెంగాలీ బంధువులు ప్రతీకారం తీర్చుకుంటారని ఆశిస్తున్నాను. బంగ్లాదేశ్ జట్టు, భారత్‌ని ఓడించగలిగితే నేను ఢాకాకి వెళ్తా. అక్కడ బెంగాలీ బాయ్‌తో ఫిష్ డిన్నర్ డేట్ చేస్తా'.  అంటూ పోస్ట్ చేసింది పాకిస్తాన్ నటి సెహెర్ షిన్వారి...

ALSO READ : World Cup 2023: ఆ ముగ్గురితో జాగ్రత్త.. బంగ్లాతో పోరుకు ముందు రోహిత్‌కు హెచ్చరికలు
 
వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత జట్టుకి బంగ్లాదేశ్‌పై గెలిచిన రికార్డు ఉంది. 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో మొట్టమొదటిసారిగా బంగ్లాతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్  ఓడింది. అంతేకాదు బంగ్లాపై ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడిపోయింది. దీంతో ఈ పాకిస్థాన్ నటి ఇచ్చిన బంపర్ ఆఫర్ తో మరింతగా చెలరేగి ఆడతారేమో చూడాలి.