షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా.. జులై 15,16 తేదీల్లో నిర్వహణ

షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా.. జులై 15,16 తేదీల్లో  నిర్వహణ

షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా
ఈ నెల 15,16 తేదీల్లో  నిర్వహణ 
వందకు పైగా కంపెనీల్లో జాబ్ ల రిక్రూట్ 
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
బీజేపీ సీనియర్ నేత, పాలమూరు ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి 

షాద్ నగర్, వెలుగు : నియోజకవర్గంలోని నిరుద్యోగులు అధైర్య పడొద్దని, వారికి అండగా పాలమూరు ట్రస్ట్ ఉందని బీజేపీ సీనియర్ నేత, పాలమూరు ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలో  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం పాలమూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హతను బట్టి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 

 ఈనెల 15,16 లలో శ్రేయాస్ కన్సల్టెన్సీ, పీవీఆర్‌‌‌‌ సంయుక్తాధ్వర్యంలో ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్‌‌లో మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వందకు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9490956938,9398160997 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. బీజేపీ నేతలు రుషికేశ్, మోహన్ సింగ్, ఆకుల ప్రదీప్, మురళి, బుగ్గరాజు తదితరులు ఉన్నారు.