
పాల్వంచ, వెలుగు : పట్టణంలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ 6వ దశ నిర్మాణంలో పని చేసిన తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నిర్మాణ కార్మికులు కేటీపీఎస్ ఎదుట చేస్తున్న రిలే నిరా హార దీక్షలు ఆదివారం 68వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో భూక్య దేవ్ సింగ్, వసంత, బట్టు నర సమ్మ, సరోజ, ధరావత్ బిక్కులాల్, ఎం.శ్రీనివాస రావు, పార్వతి, శారద, అజ్మీరా చందు కూర్చున్నారు.
ఈ సందర్భంగా సంఘ కన్వీ నర్ హతీరాం మాట్లాడుతూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కర్మాగారం పూర్తి చేసిన తమకు జెన్కో యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.