పాల్వంచ పట్టణం కేటీపీఎస్ ఎదుట 68వ రోజుకు చేరిన దీక్షలు

పాల్వంచ పట్టణం కేటీపీఎస్ ఎదుట 68వ రోజుకు చేరిన దీక్షలు

పాల్వంచ, వెలుగు : పట్టణంలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ 6వ దశ నిర్మాణంలో పని చేసిన తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నిర్మాణ కార్మికులు కేటీపీఎస్ ఎదుట చేస్తున్న రిలే నిరా హార దీక్షలు ఆదివారం 68వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో భూక్య దేవ్ సింగ్, వసంత, బట్టు నర సమ్మ, సరోజ, ధరావత్ బిక్కులాల్, ఎం.శ్రీనివాస రావు, పార్వతి, శారద, అజ్మీరా చందు కూర్చున్నారు. 

ఈ సందర్భంగా సంఘ కన్వీ నర్ హతీరాం మాట్లాడుతూ  ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కర్మాగారం పూర్తి చేసిన తమకు జెన్​కో యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.