కరెంట్ వైర్ తెగిపడి పాన్ డబ్బా దగ్ధం

కరెంట్ వైర్ తెగిపడి పాన్ డబ్బా దగ్ధం

 ఎల్​బీనగర్, వెలుగు: కరెంట్ వైర్ తెగిపడి మంటలు చెలరేగి పాన్ డబ్బా దగ్ధమైన ఘటన ఎల్​బీనగర్ పరిధిలో జరిగింది.  ఎల్​బీనగర్​లో  శ్రీ గణేశ్ ఎలక్ట్రికల్ హార్డ్​వేర్, పెయింట్స్ షాపు ఆవరణలో పాన్ డబ్బా ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరెంట్ వైర్ తెగి కిందపడటంతో షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. పాన్ డబ్బా పూర్తిగా దగ్ధమవగా.. హార్డ్​వేర్ షాపు బోర్డు కాలిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

 ఎలక్ట్రిక్ కారులో మంటలు

కంటోన్మెంట్:  కానాజీగూడకు చెందిన జోనాథన్ సాఫ్ట్​వేర్ జాబ్ చేస్తున్నాడు. గురువారం రాత్రి 7 గంటలకు ఎలక్ట్రిక్ కారులో బోయిన్​పల్లి పరిధిలోని డెయిరీ ఫామ్ రోడ్​లో వెళ్తున్నాడు. కారులో శబ్ధం రావడంతో పక్కకు ఆపాడు. కిందకి దిగి చూడగా.. కారులో నుంచి మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం దగ్ధమైంది.