
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సెక్రటేరియెట్ లో కలిశారు. కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ను పెంచి, పదోన్నతులకు మార్గం సుగమం చేయడాన్ని కేబినెట్ ఆమోదించడంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపిన మంత్రి సీతక్కను సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు పి. మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.అరుణ్ తదితరులు ఉన్నారు