గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన రూ.8500 జీతాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్ లోని పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీసు ముందు సుమారు వెయ్యి మంది కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఐదేండ్లుగా జీతాలు పెంచాలని ధర్నాలు, సమ్మెలు చేస్తుంటే జీవో విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. కాని ఏ ఫండ్స్ నుంచి ఇవ్వాలో స్పష్టత ఇవ్వలేదన్నారు. గతంలో మాదిరిగా కేటగిరి విధానాన్ని కొనసాగించటంతో పాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను సర్పంచ్ లు అక్రమంగా తొలగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్కే డే పేరిట ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. కార్మికులతోని బాండ్ పేపర్ రాయించుకునే పద్ధతిని ఆపాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావును భాస్కర్ నేతృత్వంలోని పలువురు ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లపై ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య పాల్గొన్నారు.
మా జీతాలిస్తరా..ఇయ్యరా?.. పంచాయతీ కార్మికుల ఆందోళన
- తెలంగాణం
- January 18, 2020
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- Andhra Polling : ఇడుపులపాయలో ఓటు వేసిన వైఎస్ షర్మిల
- ప్రశాంతంగా ఎన్నికలు.. 9 గంటల వరకు 9.5 శాతం ఓటింగ్
- పోలింగ్ బూత్ కోసం ఆందోళన.. ఓటింగ్ బహిష్కరించిన కోడిచర్ల తండావాసుల ధర్నా
- తిరుపతిలో దొంగ ఓట్ల రచ్చ.. వైసీపీ, బీజేపీ మధ్య గొడవ
- Telangana Polling : పెద్దపల్లిలో 2 గంటల్లో 10 శాతం ఓటింగ్
- హైదరాబాద్లో ఓటేసిన సెలబ్రిటీలు
- రష్యాలో అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలి.. 13 మంది మృతి
- Andhra Polling : మంగళగిరిలో ఓటు వేసిన పవన్, అతని భార్య
- న్యూక్లియర్ బాంబు తయారీకి వెనుకాడం.. ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..