బీజేపీ ఆఫీసులో దీన్ దయాల్ జయంతి వేడుకలు

బీజేపీ ఆఫీసులో దీన్ దయాల్ జయంతి వేడుకలు

బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆఫీస్ లో మొక్క నాటారు బీజేపీ నేతలు. ఉపాధ్యాయ్ చిత్ర పటానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఇతర నేతలు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ్ చూపిన బాటలో ఆయన సిద్ధాంతం ప్రకారం పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని  కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం కోసం కేంద్రం తన వాటా నిధులు ఇస్తే.. రాష్ట్ర సర్కార్ మాత్రం గత నాలుగైదేళ్లుగా నిధులు ఇవ్వకపోవడంతో రుణ సదుపాయం అందుబాటులోకి రాలేదన్నారు. రాష్ట్ర సర్కార్ మహిళల ఉసురు తీస్తోందన్నారు.