పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమ జంట సూసైడ్

పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమ జంట సూసైడ్

జడ్చర్ల, వెలుగు: ప్రేమ జంట మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలంలో ఆదివారం సూసైడ్​ చేసుకుంది. శనివారం ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రేమికులు ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేముల గ్రామానికి చెందిన బెట్టరి శ్రీకాంత్(22), అదే గ్రామానికి చెందిన ముష్టి అఖిల(14) కొద్దిరోజులుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇద్దరూ ఆదివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన రోజే.. తన కూతురును శ్రీకాంత్ కిడ్నాప్ చేశాడంటూ అమ్మాయి తండ్రి మిడ్జిల్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు ఫైల్ చేశారు. పోలీసులు స్పాట్ ను పరిశీలించి డెడ్ బాడీలను పోస్ట్ మార్టానికి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.