వ్యాక్సిన్లతోనే పాప చనిపోయిందని పేరెంట్స్ ఆందోళన

వ్యాక్సిన్లతోనే పాప చనిపోయిందని పేరెంట్స్ ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక PHCలో దారుణం జరిగింది. టీకాలు వేసిన కొద్ది సమయానికి చిన్నారి చనిపోయింది. వ్యాక్సిన్లతోనే తమ మూడు నెలల పాప చనిపోయిందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సారపాక గ్రామానికి చెందిన సోంపల్లి సందీప్-నాగలక్ష్మి తమ పాపకు వ్యాక్సిన్లు ఇప్పించేందుకు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. టీకాలు వేసిన కొద్దిసేపటికి పాప చనిపోయింది. ఒకేసారి ఐదు టీకాలు ఇవ్వటంతోనే తమ పాప చనిపోయిందని.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు, పోలీసులు.. పోస్టుమార్టం కోసం పాప డెడ్ బాడీని తరలించారు.