
న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో ఖర్గేతో రామ్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.
‘తెలంగాణ ఏర్పాడ్డాక 2014, 2023 ఎన్నికల్లో రెండుసార్లు గెలుపోందాను. ఈ రెండు ఎన్నికల్లో విజయం సాధించిన వారికి మంత్రి వర్గంలో అవకాశం వచ్చింది. కాబట్టి నాకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి’ అని కోరారు.