వికారాబాద్, వెలుగు: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం పరిగి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా చేవెల్లలోని షాబాద్ ఎక్స్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలవడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో పాటు కాలు విరిగినట్లు తెలుస్తోంది.