ఇఫ్తార్ విందులో ఇద్దరు సీఎంలు

ఇఫ్తార్ విందులో ఇద్దరు సీఎంలు

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ హైదరాబాద్  రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన‌ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో ఏర్పాటు చేసిన ఈ విందులో పాల్గొన్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌.. ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఇద్దరు సీఎంలు.. రాజ్ భవన్ లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన, కార్యాలయాల అప్పగింత తదితర సమస్యలపై చర్చించారు.