సుధీర్ రెడ్డి.. పార్టీని, ప్రజలను మోసం చేసిండు .. మధుయాష్కి గౌడ్

సుధీర్ రెడ్డి.. పార్టీని, ప్రజలను మోసం చేసిండు .. మధుయాష్కి గౌడ్

ఎల్బీనగర్, వెలుగు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నమ్మిన నాయకులను, పార్టీనే కాకుండా మోసపూరిత హామీలతో ప్రజలను కూడా మోసం చేశాడని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. జీవో 118 బాధిత కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో బుధవారం ఆయన మాట్లాడారు.

 బీఆర్​ఎస్​ హయాంలో సుధీర్​రెడ్డి జీవో 118 తీసుకువచ్చి ప్లాట్లు, ఇళ్లు నిర్మించుకున్న వారిని ఆక్రమణదారులుగా మార్చేశారన్నారు. ఇప్పుడు అదే జీవో ద్వారా కన్వీనియన్స్ డీడీలు ఇప్పిస్తామంటూ మరోసారి మోసం చేస్తున్నారన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికే పార్టీ మారుతున్నానని చెప్పి.. ఇప్పటివరకు ఆ సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.