10 జిల్లాలకు టీఆర్పీ ఇన్ ఛార్జీల నియామకం..వెల్లడించిన పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న

10 జిల్లాలకు టీఆర్పీ ఇన్ ఛార్జీల నియామకం..వెల్లడించిన పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ ​సిటీ, వెలుగు:  తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఇన్​చార్జీలను నియమించింది. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇన్​చార్జీలను నియమించినట్టు టీఆర్పీ చీఫ్ తీన్మార్ ​మల్లన్న సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా టీఆర్పీ కార్యవర్గాలను నియమించి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర స్టేట్​ ఆఫీసుకు అందజేయాలని ఆదేశించినట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లాల ఇన్​చార్జీలుగా సుధగాని హరిశంకర్​గౌడ్ ​(రంగారెడ్డి), మాదం రజనీ కుమార్​యాదవ్(కరీంనగర్​), వట్టే జానయ్య యాదవ్​ (నల్గొండ), జ్యోతి పండల్​ (మెదక్), కలివేముల మధుబాబు (ఖమ్మం), సంగెం సూర్యారావు(మహబూబ్​నగర్​), పల్లెబోయిన అశోక్​ ముదిరాజ్​(వరంగల్​), భావన వెంకటేశ్​(హైదరాబాద్​),  కొమ్ముల ప్రవీణ్​(ఆదిలాబాద్​)ను నియమించినట్టు మల్లన్న పేర్కొన్నారు.