చేవెళ్లలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: పామెన భీం భరత్

చేవెళ్లలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: పామెన భీం భరత్

చేవెళ్ల, వెలుగు: చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ చేవెళ్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ పామెన భీం భరత్ సూచించారు. చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆఫీసును ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని తంగడపల్లి, మల్కాపూర్ గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన దాదాపు 150 మంది భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వేమేనన్నారు. 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజా ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్‌ రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్‌ రెడ్డి, పీసీసీ మెంబర్ జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.