గోదావరిలో మునిగి పాస్టర్ మృతి

గోదావరిలో మునిగి పాస్టర్ మృతి

మణుగూరు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చర్చి పాస్టర్  చనిపోయాడు. సీఐ పాటి నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్  మైప ఏసోబు(40) ఈ నెల 6న చర్ల మండలం ఆరె కొత్తగూడెం గ్రామానికి పడవలో వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. 

మంగళవారం (june10) గోదావరిలో శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిలో ఈతకు వెళ్లి చనిపోయినట్లు భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.