వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ నాకే: పట్నం మహేందర్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ నాకే: పట్నం మహేందర్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి తానే బరిలో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్,కేటీఆర్ నాకు టికెట్ ఇస్తారంటూ ఆయన చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తానే సీనియర్ ను అన్నారు. పెద్దేముల్ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన ఇవాళ పాల్గొన్నారు. తన అభిమానులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని.. టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానన్నారు. అలాగే జనవరి నుంచి పల్లెపల్లెకు పట్నం పేరుతో కార్యక్రమం మొదలుపెడతానని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.  

గత కొంతకాలంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి పట్నం మహేందర్ రెడ్డికి మధ్య విభేదాలున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సారి తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని పట్నం మహేందర్ రెడ్డి ప్రచారం చేయడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.