అమరావతి రైతుల త్యాగాన్ని ప్రధాని మోదీ గుర్తించారు: పవన్​ కళ్యాణ్​

అమరావతి రైతుల త్యాగాన్ని ప్రధాని మోదీ గుర్తించారు: పవన్​  కళ్యాణ్​

అమరావతిలో పునర్నిర్మాణ పనులు మోది ప్రారంభించే వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం  పవన్​ కళ్యాణ్​ ప్రసంగించారు.140 కోట్ల మంది ప్రజల బాధ్యతను మోదీ తీసుకున్నారని ... పవన్​ అన్నారు.  అమరావతి రైతుల త్యాగాలను మోదీ గుర్తించారన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచి పెట్టేసిందన్నారు.  ఐదేళ్లు అమరావతి ప్రజలు నలిగిపోయి.. పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారు.. . అమరావతి రైతులకు అండగా ఉంటామని గతంలోనే చెప్పామన్న పవన్​ ..... ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పునర్​ నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారని తెలిపారు.  

Also Read : జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేసిందని.. అమరావతిని అవమాన పరిచిందన్నారు.  ప్రధాని మోదీ రాష్ట్రానికి భవిష్యత్​ ఇచ్చారన్నారు.  అమరావతి రైతులు గత ఐదేళ్లు పోరాడారని.. .. మహిళలు ధర్మయుద్దం చేశారంటూ.. సీఎం చంద్రబాబు తన అనుభవంతో అమరావతి రాజధానిని తీర్చి దిద్దుతారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్​ లో 27 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపిన సమయంలో  ..ప్రధాని మోదీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడకు వచ్చారన్నారు.