
అమరావతిలో పునర్నిర్మాణ పనులు మోది ప్రారంభించే వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.140 కోట్ల మంది ప్రజల బాధ్యతను మోదీ తీసుకున్నారని ... పవన్ అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను మోదీ గుర్తించారన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచి పెట్టేసిందన్నారు. ఐదేళ్లు అమరావతి ప్రజలు నలిగిపోయి.. పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారు.. . అమరావతి రైతులకు అండగా ఉంటామని గతంలోనే చెప్పామన్న పవన్ ..... ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పునర్ నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారని తెలిపారు.
Also Read : జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేసిందని.. అమరావతిని అవమాన పరిచిందన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి భవిష్యత్ ఇచ్చారన్నారు. అమరావతి రైతులు గత ఐదేళ్లు పోరాడారని.. .. మహిళలు ధర్మయుద్దం చేశారంటూ.. సీఎం చంద్రబాబు తన అనుభవంతో అమరావతి రాజధానిని తీర్చి దిద్దుతారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ లో 27 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపిన సమయంలో ..ప్రధాని మోదీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడకు వచ్చారన్నారు.