మోదీకి ఓటేస్తే.. నాకు వేసినట్టే: పవన్ కళ్యాణ్

మోదీకి ఓటేస్తే.. నాకు వేసినట్టే: పవన్ కళ్యాణ్

జీడిమెట్ల, వెలుగు : దేశం అభివృద్ధి చెందిన విధంగా తెలంగాణ కూడా కావాలంటే బీజేపీని గెలిపించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మోదీకి ఓటు వేస్తే తనకు ఓటేసినట్లేనని సూచించారు. నిజాంపేట్ లో శనివారం కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్​ మాట్లాడుతూ.. దేశానికి ప్రధాని మోదీ బలమైన నాయకుడని, అలాంటి వారి నాయకత్వంలోనే  ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. టెర్రరిజం తగ్గి అభివృద్ధి పెరిగిందంటే దానికి కారణం మోదీ నాయకత్వమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవసరం ఉందన్నారు. అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

 రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి బీజేపీ, జనసేన సమష్టిగా పోరాటం చేస్తాయన్నారు. కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.