జనసేనలోకి పృధ్వీరాజ్ ఫ్యామిలీ,  జానీ మాస్టర్ … కండువా కప్పి ఆహ్వానించిన పవన్ 

జనసేనలోకి పృధ్వీరాజ్ ఫ్యామిలీ,  జానీ మాస్టర్ … కండువా కప్పి ఆహ్వానించిన పవన్ 

సినీ నటుడు పృధ్వీరాజు, డ్యాన్స్ మాస్టర్ షేక్ జానీ జనసేన తీర్థం పుట్టుకున్నారు. బుధవారం( జనవరి 24) పవన్ కల్యాణ్ సమక్షంలో వీరిద్దరూ జనసేనలో చేరారు.

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ’ డైలాగ్ ఫేమ్ యాక్టర్ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి పృధ్వీరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పృధ్వీరాజ్‌ను సాదరంగా ఆహ్వానించారు. 

పృధ్వీరాజ్‌తోపాటు జానీ మాస్టర్ కూడా ఈ రోజు ( జనవరి 24) జనసేన పార్టీలో చేరారు. కొన్నాళ్లుగా ప్రజా సమస్యలపై స్వయంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్న జానీ మాస్టర్ దాదాపు పొలిటికల్ ఎంట్రీ చాన్నాళ్ల క్రితమే ఇచ్చారు. తాజాగా జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.