
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరు ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి భేటీతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో పై ప్రధానంగా చంద్రబాబు,పవన్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కుప్పం ఘటన సందర్భంగా బాబుకు, జనసేనాని మద్దతు తెలిపినట్టు సమాచారం. గతంలోనూ వైజాగ్ ఘటన సందర్భంగా పవన్కు మద్దతు తెలిపారు చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన కూడా ఇరువులు నేతల మధ్య చర్చించే జరిపే అవకాశం ఉంది.