బిందు నా మనుస్సును దోచేసింది..పవన్ లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

బిందు నా మనుస్సును దోచేసింది..పవన్ లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

జనసేన అధ్యకుడు..హీరో పవన్ కళ్యాణ్ (PawanKalyan) సినిమాలతోను, రాజకీయాలలోను క్రియాశీలకంగా ముందుకెళ్తున్నాడు. వరుస సినిమాలు చేసుకుంటూనే..రాజకీయా ప్రచారంలో భాగమవుతున్నాడు.

లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఫ్యాన్స్తో పాటు..నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్లో ఓ పోలీస్ కుక్కతో పవన్ సరదాగా ఉన్న వీడియోను షేర్ చేస్తూ.." నేను బేగంపేట ఎయిర్ పోర్ట్లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా..నా కోసం ఓ సర్ప్రైజ్ విజిటర్ వచ్చాడు. అతను ఎవరో కాదు..పోలీస్ డాగ్ స్క్వాడ్లో ఉండే బిందు. అది నాతో చాలా స్నేహంగా..ప్రేమగా ఉంది. తన తోకని ఆసక్తిగా ఊపూతూ..తను నాలో మరింత ఉత్సాహం నింపింది. నేను విమానం ఎక్కేముందు అనుకోని అందమైన అనుభూతి ఇచ్చింది..ఈ క్షణం ఎప్పటికీ మరువలేను" అంటూ రాసుకోచ్చాడు పవన్ కళ్యాణ్.

దీంతో పవన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ పోలీస్ డాగ్తో పవన్ క్యూట్ వీడియో అదిరింది..మనుష్యులందు నీ కథ..మహర్షిలా సాగదా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ నుంచి రాజకీయాలకు సంబంధించి యాక్టీవ్ గా ఉంటాడు. ఇక కొద్ది నెలల క్రితం ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి..తనదైన పోస్టులతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఇంస్టాగ్రామ్ లో 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం పవన్ సినిమాల విషయానికి వస్తే..డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్తో OG, క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan)