రహస్యంగా కలుసుకున్నరు.. ఒక్కటే సమాధానం చెప్పాలని డిసైడయ్యారు

రహస్యంగా కలుసుకున్నరు.. ఒక్కటే సమాధానం చెప్పాలని డిసైడయ్యారు

మాజీ మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ శామీర్ పేటలో రహస్యంగా భేటీ అయ్యారని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  అన్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే హరీశ్ ఈటలను కలిశారని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణపై మాట్లాడుకున్నారని చెప్పారు. విచారణలో ఒక్కటే సమాధానం చెప్పాలని ముగ్గురు డిసైడ్ అయ్యారని ఆరోపించారు మహేశ్ కుమార్ .

కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆనాడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆ ఆరోపణలను ఈటల నిజం చేస్తారా? లేక కేసీఆర్ తో ఉన్న పాత దోస్తీతో అబద్ధాలు చెప్తారా? ఈటల బీజేపీ మనిషా.. ఎవరి మనిషో విచారణ రోజు బయటపడుతుంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల వాస్తవాలు చెప్పాలి.  దొంగలుదొంగలు ఊర్లు పంచుకున్నట్లు  చేశారు.   అని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

►ALSO READ | ఎన్ని యుద్ధ విమానాలు కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చచ్చారో అడగాల్సింది

కేసీఆర్, కిషన్ రెడ్డి కలయిక వల్లే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.  బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన నేతలెవరో రాజాసింగ్ చెబుతున్నారు. ముందు కవిత, రాజాసింగ్ ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానంచెప్పాలి.  కులగణన చేయాలంటే దమ్ముండాలి.  కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, ఎందుకు స్పందించరు.? పదేండ్లు దోచుకున్నసొమ్మే బీఆర్ఎస్ లో గొడవలకు దారితీసింది.  ప్రతి పార్టీలో కోవర్టులు ఉంటారు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.