తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్కు సంబంధం లేదు

తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్కు సంబంధం లేదు

మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. లీగల్ నోటీసులతో పాటు పలు అంశాలపై స్పందిస్తూ కౌంటరిచ్చారు.  లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను టీఎస్పీఎస్సీ విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడని చెప్పారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం మంత్రి కేటీఆర్ కు సంబంధం లేదని ఎలా చెప్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  నిందితుడి రాజశేఖర్ రెడ్డి నియామకం ఐటీ శాఖ ద్వారానే జరిగిందని చెప్పారు. టీఎస్పీఎస్సీకి సాంకేతిక పరిజ్ఞానం ఐటీ శాఖే అందిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్కు సంబంధం లేదన్నారు.