రేవంత్ ఎవరిని మోసం చేస్తున్నరు? : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్

రేవంత్ ఎవరిని మోసం చేస్తున్నరు? : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్
  •     తుమ్మిడిహెట్టి విషయంలో ఫడ్నవీస్​ అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ ఇవ్వరు: వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ మాజీ ఎంపీ వినోద్​ కుమార్ ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అడ్డుపడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అంటున్నారని, మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లెటర్ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు అంటున్నారని పేర్కొన్నారు. 

బుధవారం ఆయన తెలంగాణభవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ఫడ్నవీస్​ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వరని రేవంత్‌‌‌‌‌‌‌‌కు తెలుసన్నారు. రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి చివరకు మేడిగడ్డే దిక్కని, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆప్షన్ అని చెప్పారు. మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్​ వేచి చూశారని కానీ, ఇప్పుడు దానికే ఆయన రిపేర్లు చేస్తున్నారని ఎద్దేవాచేశారు.