హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

రాష్ట్రాన్ని, యువతను  డ్రగ్స్ మహమ్మారి  పట్టిపీడిస్తోందన్నారు.. పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని  డ్రగ్స్ మాఫియా  రెచ్చిపోతోందన్నారు. ప్రభుత్వ  పెద్దలు  డ్రగ్స్ కేసును  బలహీన పరిచారని ఆరోపించారు.  ఈడీ కార్యాలయానికి   వెళ్లిన రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ కేసు  పారదర్శకంగా  విచారణ చేపట్టాలని అధికారులను  కోరారు. డ్రగ్స్ కేసులో  గతంలో ఎక్సైజ్ శాఖ  సరైన విచారణ  చేపట్టలేదన్నారు రేవంత్. కేసుకు సర్కార్  సహకరించడం  లేదని  ED చెబుతోందని  చెప్పారు.  నిందితుల  దగ్గర సేకరించిన  ఫోన్, ల్యాప్ టాప్స్ EDకి  ఇవ్వాలన్నారు. అప్పుడే  కేసులో ఎవరెవరు  ఉన్నారో తెలుస్తుందన్నారు రేవంత్.