అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణకు అఖిలపక్షాన్ని అనుమతించాలె : రేవంత్ రెడ్డి

అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణకు అఖిలపక్షాన్ని అనుమతించాలె : రేవంత్ రెడ్డి

నూతన సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన స్లైల్లో స్పందించారు. ‘కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసి మారేడుకాయ చేయడం తప్పు. కేసీఆర్ పుట్టినరోజే ప్రారంభించాలన్న  ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఆయన పుట్టినరోజు ప్రారంభించడానికి ఇదేమైన రాచరికమా. అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి’ అని ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

ఇవాళ ఉదయం నూతన సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ ప్రధాన గోపురం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. భారీ పొగలతో అక్కడ పని చేస్తున్న కార్మికులు ఉక్కిరి బిక్కరయ్యారు. విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.  అగ్ని ప్రమాదం జరగడంతో కొత్త సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను కూడా అటు వైపునకు అనుమతించడం లేదు.  కొత్త సెక్రటేరియట్ లో ఎలక్ట్రికల్ పనులు నడుస్తున్నాయని తెలుస్తోంది.