- అన్నారం బ్యారేజీ బుంగపై పీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
- మందేసి గీసిన డిజైన్ల వల్లే కొట్టుకుపోతున్నయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదని, అదో స్కామేశ్వరమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అన్నారం బ్యారేజీకి పడిన బుంగపై బుధవారం ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు.‘‘కల్వకుంట్ల స్కామేశ్వరంలో మరో మైలు రాయి. నిన్న మేడిగడ్డ.. ఇవాళ అన్నారం. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు. ప్రాజెక్టు అంటే నీ ఫాం హౌస్ ప్రహరీ గోడ అనుకున్నావో.. నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. లక్ష కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును మింగేసి నాలుగు కోట్ల జనం నోట్లో మట్టి కొట్టావు.
వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు ఇలా కండ్ల ముందే కొట్టుకుపోవడానికి కారణం.. మందేసి కేసీఆర్ గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు. ఇవి రూ.లక్ష కోట్ల అవినీతే కారణం’’ అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.