యాదాద్రి ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి చినజీయర్ స్వామిని తొలగించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మక్క, సారలమ్మలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన చినజీయర్ ను ఆ హోదాలో కొనసాగించడం సరికాదన్నారు. తెలంగాణ పౌరుషం, సంస్కృతికి సమ్మక్క, సారలమ్మలు ప్రతీకలన్నారు. భక్తుల విశ్వాసాలపై చినజీయర్ స్వామి దాడి చేశారని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.
తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి...మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.@TelanganaCMO pic.twitter.com/xCqh4jRyE5
— Revanth Reddy (@revanth_anumula) March 18, 2022
కాగా, సమ్మక్క, సారలమ్మల గురించి, మేడారం జాతరను తక్కువ చేస్తూ.. గతంలో చినజీయర్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని గిరిజన సంఘాలు, అన్ని రాజకీయ పక్షా ల నేతలు డిమాండ్ చేశారు.