
- చనగాని దయాకర్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడితే ఇక నుంచి ఊరుకునేది లేదని, ఆయన చెంపలు వాయించడమేనని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం పదవికి, ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని కూడా కేటీఆర్ మాట్లాడే మాటలు దిగజార్చేలా ఉన్నాయని విమర్శించారు.
చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలనే విజ్ఞత కేటీఆర్కు లేదని, ఆయన మాటలు హద్దు మీరుతున్నాయన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హద్దులు దాటి ప్రవర్తించాల్సి ఉంటుందని, అప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేటీఆర్వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.