బీజేపీ నేతలు చరిత్ర తెలుసుకోవాలి : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

బీజేపీ నేతలు చరిత్ర తెలుసుకోవాలి : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలు గాంధీ కుటుం బం గురించి, కాంగ్రెస్ గురించి చరిత్ర తెలుసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. బీజేపీ ఎంపీ  రఘునందన్ రావు గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. శుక్రవారం గాంధీ భవన్​లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కిషన్ రెడ్డి మొట్టికాయలకు రఘునంద న్ మైండ్ బ్లాక్ అయి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ కమిటీల్లో సామాజిక న్యాయం పాటించారని, మంత్రి కోమటిరెడ్డిని పీఏసీ కమిటీలో తీసుకోవాల్సిందన్నారు. జానారెడ్డి ఉన్న కమిటీలో చోటివ్వడం తనకు ప్రమోషన్ అని జగ్గారెడ్డి తెలిపారు.