అందరినీ మెప్పించేలా కమిటీలు: జగ్గారెడ్డి 

అందరినీ మెప్పించేలా కమిటీలు: జగ్గారెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పోటీ ఎప్పుడూ ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అందరికీ అవకాశం కల్పించేలా జంబో కమిటీ వేశారని, కాంగ్రెస్ లో నేతలకు కొదవ లేదని అన్నారు. ఎవరైనా మిస్సైతే వారిని తర్వాత కలుపుకోవచ్చని చెప్పారు.

ఏఐసీసీ విడుదల చేసిన కాంగ్రెస్ స్టేట్ కమిటీలపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ నిర్ణయాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందేనన్నారు. అందరినీ సంప్రదించిన తర్వాతనే ఈ టీమ్ తయారైనట్టుగా కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ కోమటి రెడ్డి గురించి రాహుల్, వేణుగోపాల్, మాణిక్కం ఠాకూర్, రేవంత్ స్పందిస్తారన్నారు.